బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో రూ.64 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

