ప్యాకేజీ ఇచ్చాకే గ్రామాలు ఖాళీ చేయించాలి: MPJ

AP: వెలుగొండ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ పూర్తిగా చెల్లించిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించాలని ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలను మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజీ చెల్లింపుల అనంతరం గ్రామాల నుంచి తరలించేందుకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని రజాక్ కోరారు.

