← Back to news

నోటీసుల ప్రక్రియ పకడ్బందీగా చేయాలి

By Jelandharkoti Koti· 29 Aug 2026
నోటీసుల ప్రక్రియ పకడ్బందీగా చేయాలి

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భూముల రీసర్వే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కోటపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, తహసీల్దార్ రాఘవేంద్ర, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డితో కలిసి ఎస్ఐఆర్, భూముల రీసర్వేపై సమీక్ష నిర్వహించారు. రీసర్వే పనుల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

More in Local