ఎల్లమ్మ తండాలో వీరాంజనేయస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలు

మంచాల మండలంలోని ఎల్లమ్మ తండాలో మందాపురం వీరాంజనేయస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా సాగుతున్నాయి. ఆలయంలో అగ్నిగుండం పూజలు నిర్వహించారు. పూజలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేపు ఆలయంలో వీరాంజనేయస్వామి, గణపతి, నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

