← Back to news

24 ఏళ్ల తర్వాత కొడుకుతో ఇంటి ముందు మహిళ ధర్నా

By Bandari Prakash· 28 Aug 2026· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal
24 ఏళ్ల తర్వాత కొడుకుతో ఇంటి ముందు మహిళ ధర్నా

గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీలో ఓ మహిళ ధర్నా చేపట్టింది. 24 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో పని చేసే టైంలో యజమాని కుమారుడు తనపై లైంగికదాడి చేశారని, దాంతో తనకు కొడుకు పుట్టాడని వివరించింది. అతడే తన కొడుకుకు తండ్రి అని ఆరోపిస్తూ కొడుకుతో కలిసి ధర్నాకు దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం తను ఎలాంటి తప్పు చేయలేదని, నిజానిజాలు తేలడానికి డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమేనని ప్రకటించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

More in Local