నీట్ పీజీ ఎగ్జామ్ సెంటర్ పరిశీలన

నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 ఎగ్జామ్ సెంటర్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన వసతులు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

