← Back to news

నీటి వనరుల అభివృద్ధికి శ్రీకారం

By President VIDYA· 29 Aug 2026· Parvathipuram Manyam
నీటి వనరుల అభివృద్ధికి శ్రీకారం

AP: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో గిరిజన కుటుంబాల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం ప్రారంభమైంది. నాబార్డ్ సహకారంతో విద్యా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నల్లరాయిగూడ పంచాయతీలో 200 పీవీటీజీ కుటుంబాలకు తోటల పెంపకం, నీటి వనరుల అభివృద్ధి పనులను నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయ అధికారి సోమైందర్ సింగ్ ప్రారంభించారు. విద్యా ఫౌండేషన్స్ అధ్యక్షులు ప్రసాద్ ఉదండరావు మాట్లాడుతూ తివ్వకొండపై ఆరు పెర్కొలేషన్ ట్యాంకులు, రెండు ఫార్మ్ పాండ్లు నిర్మించి మొక్కలకు నీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

నీటి వనరుల అభివృద్ధికి శ్రీకారం

More in Local