గజారామం నర్సరీలో ఉచితంగా టేకు మొక్కల పంపిణీ

రైతులు తమ పట్టా భూముల్లో టేకు మొక్కలు నాటేందుకు గజారామం నర్సరీలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు పలమనేర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి చొప్ల నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టా పాస్బుక్ లేదా ఆధార్ ప్రతిని సమర్పించి ఉచితంగా టేకు మొక్కలను పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని చొప్ల నాయక్ సూచించారు.

