← Back to news

దాచేపల్లి అంజుమన్ కమిటీలో కొత్త సభ్యుడు.. నాగుల్ ఎంపిక

By SHAIK SUBHANI· 29 Aug 2026
దాచేపల్లి అంజుమన్ కమిటీలో కొత్త సభ్యుడు.. నాగుల్ ఎంపిక

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండల అంజుమన్ ఇస్లామియా కమిటీలో షేక్ నాగుల్ కొత్త సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కమిటీలో సుదీర్ఘకాలం సేవలందించిన స్వర్గీయ తొండ మహబూబ్ స్థానంలో ఆయనను నియమించారు. గత 50 ఏళ్లకు పైగా దాచేపల్లి మండలం, పరిసర ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి అంజుమన్ ఇస్లామియా కమిటీ సేవలందిస్తోందని ప్రతినిధులు తెలిపారు. మహబూబ్ కుటుంబానికి చెందిన నాగుల్ కు కమిటీలో స్థానం కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

More in Local