← Back to news

మైదుకూరులో గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళి..

By Tavva Obul Reddy· 6d ago· S.Mydukur, S.Mydukur, Y.S.R. Kadapa
మైదుకూరులో గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళి..

మైదుకూరు ZPHS (boys) లో శనివారం తెలుగు భాషా, క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ గోశెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ – "తెలుగు భాషలో ప్రావీణ్యం సాధించినప్పుడే ఇతర భాషల్లో కూడా పట్టు సాధించగలర''ని అన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, గిడుగు రామ్మూర్తి పంతులుకు ఘనంగా నివాళి అర్పించారు.

More in Local