భార్య చదివిన బడికి..తనవంతు తోడ్పాటు

భార్య తనకు దూరమైనా ఆమె సజీవంగా ఉంచాలన్న సంకల్పం కలిగింది భర్తకు. భార్య చదువుకున్న బడి ప్రాంగణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం లైబ్రరీ, కంప్యూటర్ గదుల నిర్మాణానికి పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన వ్యాపారి గంధం ప్రసాద్(బాలరాజు) భూమిపూజ చేసి అందరికీ స్ఫూర్తి పంచారు.

