కాలువ పనులకు రూ.10 లక్షలు..

ఫరూక్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామీణాభివృద్ధిలో భాగంగా అయ్యవారిపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. "పారిశుధ్యమే లక్ష్యం – కాలువలు బలంగా ఉంటేనే ఊరు పరిశుభ్రంగా ఉంటుంది" అంటూ ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

