← Back to news

కోట మైసమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

By Adithya D· 6d ago
కోట మైసమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీలో కోట మైసమ్మ ఆలయంలో మూడో వార్షికోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. భారీ ఎత్తున ఊరేగింపుతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. భక్తులకు అన్న వితరణ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, శుక్రవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎండి ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.

More in Local