రక్తదాతలకు సర్టిఫికెట్ల పంపిణీ

TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెరుగు నరేష్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేసిన దాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. మండల వైద్యాధికారి తేజశ్రీ, గ్రామ సర్పంచ్ బండమీది కవిత గోపి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

