← Back to news

అక్రమ బ్లాస్టింగ్‌ను నిలిపివేయాలి: గొంగళ్ల రంజిత్

By Bandari Prakash Sir· 28 Aug 2026· ogulamba Gadwal

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురంలో అక్రమ బ్లాస్టింగ్‌తో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఆర్‌ఎస్ గద్వాల ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం రైతులతో కలిసి బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రషర్ మిషన్, పేలుళ్ల కారణంగా ఇళ్లు బీటలు వారడంతో పాటు పంటలు, బోర్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బ్లాస్టింగ్‌ను వెంటనే నిలిపివేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local