స్టీరింగ్పైనే కుప్పకూలిన బస్సు డ్రైవర్
TG: జగిత్యాల జిల్లా మద్దునూరు నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మణ్కు మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో స్టీరింగ్పైనే కుప్పకూలారు. అయితే చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు అదుపు తప్పకుండా పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఘటన అనంతరం 108కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆటోలో లక్ష్మణ్ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వచ్చే సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్న లక్ష్మణ్ ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా డ్రైవింగ్ డ్యూటీ వేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

