కరెంట్ బిల్లులు చెల్లించినా అదనంగా డబ్బులు డిమాండ్

TG: వరంగల్ జిల్లా శంభునిపేటలో విద్యుత్ వినియోగదారులకు ఫోన్ చేసి రూ.3 వేలు డిమాండ్ చేసినట్లు ఓ అసిస్టెంట్ లైన్మ్యాన్పై ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తున్నప్పటికీ అదనంగా డబ్బులు ఇవ్వాలని కోరినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వినియోగదారులు కోరారు.

