ధర్మారం ఎస్ఐగా ఎంబడి శ్రీకాంత్

పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం.

