పర్లాకిమిడి కోటలో భాషా దినోత్సవం.. గిడుగుకు నివాళి!

తెలుగు భాషకు పునర్జన్మ ఇచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులను గుర్తుచేసుకునేందుకు పర్లాకిమిడి కోట ముఖద్వారం వద్ద ప్రత్యేక వేడుకలు జరిగాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు సాహిత్య ప్రముఖుల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు సనపల వైకుంఠరావు మాట్లాడుతూ – "తెలుగు భాషను సామాన్యులకు చేరువ చేసిన గిడుగు సేవలు చిరస్మరణీయం. పర్లాకిమిడి సంస్థానంలో ఆయన సేవలకు గుర్తుగా ఇక్కడ వేడుకలు జరగడం విశేషం" అని అన్నారు.

