ప్రజల సమస్యలు తెలుసుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్

AP: చిత్తూరు జిల్లా పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. మోహన్రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గడ్డూరు కాలనీని సందర్శించి గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు, అవసరాలపై ఆరా తీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. గొడవలు, వివాదాలు, ప్రలోభాలకు దూరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.


