← Back to news

కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర

By Uday· 29 Aug 2026· Nandyal
కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర

AP: నంద్యాల జిల్లా రైతుల సాగునీటి సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి విమర్శించారు. నంద్యాలలోని తన నివాసంలో రైతులతో సమీక్ష నిర్వహించి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. సెప్టెంబర్‌ 1న వెలుగోడు రిజర్వాయర్‌ వద్ద సాగునీటి సాధన కోసం వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర
కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర

More in Local