ట్రాక్టర్ డ్రైవర్.. విద్యుత్ టవర్కు ఉరి!

పోలవరం జిల్లా చింతూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. చట్టికి చెందిన సోడే రాజ్ కుమార్ (ట్రాక్టర్ డ్రైవర్) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి – శనివారం శబరి నది పక్కన ఉన్న విద్యుత్ టవర్ వరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గాలించగా ఆ స్థితిలో కనిపించాడు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గమనిక :- NCRB 2022 నివేదిక ప్రకారం, మొత్తం 1.71లక్షల ఆత్మహత్యల్లో 10.2% ప్రేమ వివాహేతర సంబంధాలవల్ల జరిగాయి.)

