జగిత్యాలలో 1.5లక్షల ఓటర్లకు నోటీసులు!

జగిత్యాలలో SIR కసరత్తు మొదలైంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అనామలీస్ (Anomalies), నో మ్యాపింగ్ కేటగిరీల్లో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల నో మ్యాపింగ్, 1.52 లక్షల అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.



