తెలుగు వెలుగును చాటిన భాషా దినోత్సవం

నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడు సురేందర్ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని, సాహిత్య వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మాతృభాష పరిరక్షణకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. తెలుగు భాషను నిత్య జీవితంలో విరివిగా ఉపయోగిస్తూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

