← Back to news

తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

By Jelandharkoti Koti· 29 Aug 2026
తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

TG: ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో అమృత్ పథకం కింద చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ట్యాంక్ నిర్మాణంతోపాటు పైపులైన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

More in Local