కస్తూర్బా విద్యార్థినులకు డ్రెస్ల అందజేత

రక్షాబంధన్ సందర్భంగా నందిపేట్ కస్తూర్బా బాలికల కళాశాలలో శుక్రవారం రాఖీ వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం విద్యార్థినులతో మాట్లాడారు. 314 మంది విద్యార్థినుల సమస్యలు, వసతులపై ఆరా తీసి, 20 మంది విద్యార్థినులకు ఉచితంగా డ్రెస్సులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యతను పరిశీలించారు.

