కొత్తపేట డిగ్రీ కాలేజీలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషకు పునర్జన్మ ఇచ్చిన గిడుగు రామ్మూర్తి పంతుల్ని గుర్తుచేసుకునేందుకు కొత్తపేటలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సి.హెచ్. పాపారావు గిడుగు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. <br>ఆయన మాట్లాడుతూ – "జనం మాట్లాడే తెలుగును నిలబెట్టిన గిడుగు సేవలు మరువలేనివి. ప్రజలకు అర్థమయ్యే భాషలో తెలుగు అభివృద్ధి చెందాలని ఆయన చేసిన కృషి ఆదర్శమని" అని అన్నారు.

