భార్యను చంపి.. పోలీస్స్టేషన్లో లొంగిపోయిన భర్త

TG: కుటుంబ కలహాలతో భర్త భార్యపై కత్తితో దాడిచేసి చంపాడు. కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న ఆస్మరా బేగం(24), షేక్ రహీంలకు 2024లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మ్యారేజ్ అయినప్పటి నుంచి వీరికి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో దంపతులిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వారి మధ్య గొడవ జరగడంతో రహీం కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం డైరెక్ట్గా రహీం స్థానిక PSలో లొంగిపోయాడు.



