మూడు వేల కోసం పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం !

పెహల్గాం దాడి గురించి స్థానికులు ఇద్దరికి ముందే తెలిసినా పోలీసులకు చెప్పలేదనే చేదు నిజం బయటపడింది. స్థానికులు బషీర్ అహ్మద్, పర్వేజ్ అహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారని దర్యాప్తులో తేలింది.ఆయుధాలతో వచ్చిన టెర్రరిస్టులు ఐదు గంటల పాటు వీరి ఇళ్లలో ఉండి ఆపై వెళిపోయారని తేలింది. వారు పంజాబీ, హిందీ భాషలు కలగలిపి మాట్లాడారని, ఆశ్రయం ఇచ్చినందుకు మూడు వేలు ఇచ్చారని అధికారులు తెలిపారు.మరుసటి రోజు పెహల్గాంలో పొదల మాటున దాక్కుని టూరిస్టులను టార్గెట్ చేసారని అధికారులు తెలిపారు.



