వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన బాధితురాలి తల్లి ఇవాళ మీడియాకి 4 పేజీల లేఖని విడుదల చేశారు. అందులో వారు మానసికంగా ఎంత క్షోభకి గురవుతున్నారో వివరించారు. బాధితురాలు మైనారా ? మేజరా ? అన్న అంశంపై అంతలా చర్చ జరగడం తమను తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తోందన్నారు. వ్యక్తిగత వివరాలు బయటపెట్టందంటూ మీడియాకి ఆమె చేతులు జోడించి వేడుకుంటున్నట్టు చెప్పారు. తమ మైనర్ బిడ్డకు పట్టిన దుస్థితి మరే పిల్లకు రాకూడదని ఆమె కోరుకున్నారు.






