300 శాతం లాభాలంటూ..రూ.85 లక్షలకు టోకరా

AP: కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్లైన్ మోసం జరిగింది. సురే వేణు దంపతులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ‘ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్’ మేనేజర్నని నమ్మించి, 3 నెలల్లో 300 శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మి విడతల వారీగా రూ.85 లక్షలు డిపాజిట్ చేశారు. తర్వాత డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్ బ్లాక్ అయింది. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.



