← Back to news

300 శాతం లాభాలంటూ..రూ.85 లక్షలకు టోకరా

By Sai Vamshi· 31 May 2026· Andhrajyothy· Kakinada
300 శాతం లాభాలంటూ..రూ.85 లక్షలకు టోకరా

AP: కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం జరిగింది. సురే వేణు దంపతులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ‘ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్’ మేనేజర్‌నని నమ్మించి, 3 నెలల్లో 300 శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మి విడతల వారీగా రూ.85 లక్షలు డిపాజిట్ చేశారు. తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్ బ్లాక్ అయింది. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.