భూపరీక్షలు చేయకుండానే బ్యారేజ్లు నిర్మించారు

TG: KCR అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, మీరు చేసిన నేరం ఘోరం మీకు తెలుసు. అందుకే ముఖం చాటేస్తున్నారని CM రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రజాభవన్లో మంత్రులు, MLAలు, MLCలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును KCR 2019 జూన్ 21న ప్రారంభించారు. ఏడాది తిరిగే లోపే మేడిగడ్డలో లోపాలన్నీ బయటపడ్డాయి. రోజురోజుకి సమస్య పెద్దదై కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు. భూపరీక్షలు చేయకుండానే ఇసుకలో బ్యారేజ్లు కట్టారు. కట్టిన వెంటనే 100శాతం సామర్థ్యంతో నీళ్లను నిల్వ చేయడంతో బరువు తట్టుకోలేక మేడిగడ్డ కుంగిపోయిందని CM ఫైరయ్యారు.



