లంచం ఇవ్వలేదని అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం

యూపీ ముజఫర్ పూర్ కు చెందిన రేష్మ అనే మహిళ తన 14 ఏళ్ల కుమార్తెకు కాలు విరగడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి డాక్టరు ఆపరేషన్ చేయడానికి లంచం అడగడంతో ఇచ్చుకోలేక మేజిస్ట్రేట్ కి కంప్లయింట్ చేసింది. ఆమెకు ఉచితంగా సర్జరీ చేయాలంటూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే ఆ వైద్యుడు లంచం ఇవ్వనిదే చేయనని మొండికేశాడు.25 వేలు ఇచ్చుకోలేనన్న ఆ మహిళ రూ. 8 వేలు చెల్లించింది. ఆపరేషన్ పూర్తయి కోలుకున్నాక చెకప్ కోసం వెడితే మిగిలిన అమౌంట్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వలేకపోవడంతో కాలును టెస్ట్ చేసే పేరుతో ఇటూ అటూ మెలిపెట్టి నలిపేశాడు. ఇంటికి వెళ్లాక చూడగా కాలు విరిగిపోయింది.



