బస్సులో మహిళ ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్, కండక్టర్

TG: పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్ర నిరోషా అనే మహిళ RTC బస్సులో వెళ్తోంది. ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో బస్సు సీట్లోనే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన బస్సు కండక్టర్ సుమన్,, డ్రైవర్ రాజు వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సును ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్కు తీసుకొచ్చారు. మహిళను అంబులెన్స్ ఎక్కించి శ్రీరాంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డ్రైవర్, కండక్టర్లను శాలువాలతో సన్మానించి అభినందించారు.



