ఫ్రీ ఫైర్ ఫ్రెండ్షిప్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

హైదరాబాద్లోని ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు 8, 9 తరగతులు చదువుతున్నారు. స్మార్ట్ఫోన్కు అలవాటు పడిన వీరు తమ కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్లలో ఫ్రీఫైర్ ఆడటం మొదలుపెట్టారు. గేమ్లో ఒకేసారి 4 నుంచి 16 మంది గ్రూప్గా కలిసి ఆడేందుకు వీలుండటంతో ఆట మధ్యలో వీరికి బిహార్కు చెందిన అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తుల మాయమాటలు నమ్మిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలి రైలులో బిహార్కు బయల్దేరారు. పోలీసులు IP అడ్రస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా APలోని ఏలూరు వద్ద వారిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.



