ఉద్యోగులకు గుడ్న్యూస్.. జులై 15 నుంచి కొత్త స్కీమ్

TG : రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ మొదటి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన హైదరాబాద్లోని సెక్రటేరియట్లో నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని CS తెలిపారు. గతంలో చికిత్సలకు గరిష్ఠంగా రూ.2 లక్షలు చెల్లించేవారని, దాన్ని ఒకేసారి చికిత్సకు కనీసం రూ.5 లక్షలిచ్చేలా మార్చాలని TS PRTU రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్రెడ్డి కోరారు.



