ప్రతిరోజూ గంట అదనంగా పనిచేయాలి: CM రేవంత్

TG: రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. ఉద్యోగులకు ఉచితంగా రూ. కోటి ప్రమాద బీమా కల్పించేందుకు 16 బ్యాంకులతో MOU కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించి వసూలు చేసే బాధ్యత మీదే అని CM పిలుపునిచ్చారు. 'ఉద్యోగులుగా మీరేం అడుగుతారో నాకు తెలుసు.. కొత్త PRCని అమలు చేస్తామని మేం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు.



