DMHO వేధిస్తున్నారని కలెక్టరేట్ వద్ద నిరసన

TG: హన్మకొండ DMHO తమను మానసికంగా వేధిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. DMHOపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో పాటు వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. DMHOపై శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.



