పెళ్లైన ఏడాదికే నవవధువు ఆత్మహత్య..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే 24 ఏళ్ల షాలిని అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేర్వేరు కులాలకు చెందిన పొన్నర్, షాలిని గతేడాది వివాహం చేసుకున్నారు. భర్త ఉద్యోగం కారణంగా బయట ఉండగా, ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆమె ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. పెళ్లైన వన్ ఇయర్ లోనే ఈ ఘటన జరగడంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.



