← Back to news

ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్

By డీకే· 1 Jul 2026· హైదరాబాద్‌
ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 30నెలల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించి రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రైతుభరోసా నిధులు విడుదల చేసి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడుకునే బాధ్యత మీదేనని CM రైతులను ఉద్దేశించి అన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఇప్పటి వరకు దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

More in TG