రాస్తారోకోతో ట్రాఫిక్జామ్.. షాబాద్లో హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో ఆరుగురి హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. షాబాద్ -షాద్నగర్ ప్రధాన రహదారిపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు చేపట్టిన రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఉద్రిక్తత నెలకుంది. షాబాద్ నుంచి సర్దార్నగర్, షాద్నగర్, ఎల్లికట్ట వరకు, మరోవైపు నాగల్గూడ వరకు సుమారు 12KM మేర వాహనాలు ఎక్కడికక్కడ భారీగా నిలిచిపోయాయి. పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు.



