← Back to news

షాబాద్ ఘటనతో భయాందోళన

By DK· 12 Jul 2026
షాబాద్ ఘటనతో భయాందోళన

TG: రిమాండ్‌లో ఉన్న నిందితులు బెయిల్‌పై బయటికి వస్తే ఎలాంటి దారుణాలకు దారి తీస్తుందో నిన్న జరిగిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుహత్యల ఘటనే ఉదాహరణగా మారింది. నిందితుడు రాజ్‌కుమార్ సుమారు రూ.20 లక్షలు షాబాద్ PS అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. షాబాద్ ఘటనతో బండి భగీరథ్ బాధిత కుటుంబం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుందని BRS నేత RS ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తనకు బాలిక, ఆమె తల్లి ఫోన్ చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ఇతను కూడా బెయిల్‌పై వచ్చాడు. మా పరిస్థితి ఏంటోనని టెన్షన్ పడ్డారని ఆయన తెలిపారు.

More in TG