తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట గ్రామ పరిధిలోని బేగరికంచలో నిర్మిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపడమే ప్రధాన లక్ష్యంగా దేశ GDPలో రాష్ట్రం వాటాను 10 శాతానికి పెంచే దిశగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించామన్నారు. పారదర్శక పాలన ఉండి మౌలికవసతులు కల్పిస్తే పారిశ్రామికంగా తెలంగాణ అన్స్టాపబుల్గా నిలుస్తుందన్నారు.



