ధరణి పోర్టల్లో బిగ్ స్కామ్

TG: ధరణి పోర్టల్ ద్వారా భూ యజమానులకు తెలియకుండానే భూములు ఇతరుల పేర్లపైకి మారడం కలకలం సృష్టిస్తోంది. ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూదోపిడీపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమం వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారుల కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు.



