← Back to news

హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

By DK· 11 Jul 2026· యాదాద్రిభువనగిరి జిల్లా
హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. వీకెండ్ కావడం, ఖమ్మం జిల్లాలో నిన్న CM రేవంత్‌రెడ్డి సభ ఉండడంతో వాహనాల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. CM సభకు జనాలను తరలించేందుకు HYDలోని వివిధ డిపోల నుంచి వందలాది RTC బస్సులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. బస్సులు ఒకేసారి హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా మీదుగా బయలుదేరాయి. అప్పటికే వాహనాలతో నిండిపోయిన హైవే, ఈ బస్సులు తోడవడంతో పంతంగి టోల్‌గేట్ వద్ద పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది.

More in TG