ఉస్మానియా డాక్టర్ల అద్భుతం.. దేశంలోనే తొలిసారి

TG: సాధారణంగా ఒక రోగి శరీరంలోని ఒక అవయవాన్ని మార్చి చికిత్సలు చేస్తుంటారు. కానీ, ఒకేసారి ఐదు అవయవాలు విజయవంతంగా మార్చి హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి డాక్టర్స్ రికార్డ్ సృష్టించారు. అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకే రోగికి ఓకేసారి ఐదు అవయవ మార్పిడిలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. జాతీయ అవయవాలు, కణజాల మార్పిడి సంస్థ (NOTTO) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉస్మానియా వైద్య బృందాన్ని అభినందించింది.



