← Back to news

యూపీఐ పేమెంట్ తో బుక్కయ్యారు: సువేందు PA హంతకులు చిక్కారిలా!

By aravinda nyayapati· 11 May 2026· Kolkata
యూపీఐ పేమెంట్ తో బుక్కయ్యారు: సువేందు PA హంతకులు చిక్కారిలా!

పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అనుచరుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులు యూపీఐ (UPI) వాడి బుక్కయ్యారు. హత్య చేసిన తర్వాత పారిపోతున్న షూటర్లు, దారిలో టోల్ ప్లాజా దగ్గర యూపీఐ పేమెంట్ చేయడంతో వారి లొకేషన్‌ను పోలీసులు ఈజీగా పట్టేసుకున్నారు. టెక్నాలజీ సాయంతో యూపీ, బీహార్ సరిహద్దుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎంత ప్లాన్ చేసినా, ఒక చిన్న ఆన్‌లైన్ పేమెంట్ హంతకులను కటకటాల వెనక్కి నెట్టింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.