యూపీఐ పేమెంట్ తో బుక్కయ్యారు: సువేందు PA హంతకులు చిక్కారిలా!

పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అనుచరుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులు యూపీఐ (UPI) వాడి బుక్కయ్యారు. హత్య చేసిన తర్వాత పారిపోతున్న షూటర్లు, దారిలో టోల్ ప్లాజా దగ్గర యూపీఐ పేమెంట్ చేయడంతో వారి లొకేషన్ను పోలీసులు ఈజీగా పట్టేసుకున్నారు. టెక్నాలజీ సాయంతో యూపీ, బీహార్ సరిహద్దుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎంత ప్లాన్ చేసినా, ఒక చిన్న ఆన్లైన్ పేమెంట్ హంతకులను కటకటాల వెనక్కి నెట్టింది.



