← Back to news

థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం

By DK· 30 Jun 2026
థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం

TG: రాష్ట్రంలో బొగ్గు కొరత నేపథ్యంలో జెన్‌కో సన్సెషనల్ డిసిషన్ తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (YTPS)లో ఒక యూనిట్‌, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(KTPS)లో మరో యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా రెండు యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. సింగరేణి నుంచి జెన్‌కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది.

More in TG