13 ఏళ్ల కబ్జాకు చెక్.. HYDRA భారీ యాక్షన్

TG: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్లోని వెంకటాద్రినగర్లో 1200 గజాల పార్కు స్థలం గత13 ఏళ్ల నుంచి కబ్జాకు గురైంది. వెంకటాద్రి నగర్ కాలనీ వాసుల సుదీర్ఘ పోరాటం ఫలిచింది. స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు TPCC ప్రచార కమిటీ ఛైర్మన్, ఎల్బీనగర్ ఇంఛార్జ్ మధు యాష్కి గౌడ్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జాకు గురైన ఆ స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.



