‘స్పెషల్ బస్సు’ చార్జీలను వెంటనే తగ్గించాలి
రక్షాబంధన్ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులపై ‘స్పెషల్ బస్సులు’ పేరుతో అదనపు చార్జీలు మోపడం దారుణమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గప్రసాద్ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్లో బీజేపీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టి, ప్రయాణికులతో రాఖీలు కట్టించుకుని ఆందోళన నిర్వహించారు. పండుగల సమయంలో అదనపు బస్సులు నడపడం స్వాగతించదగ్గదేనని, కానీ అదనపు చార్జీలు వసూలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

